
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, దళపతి విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సర్కస్ ఇలా వరుసగా ఫ్లాపులు అందుకుంది ఈ భామ. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమా ఒక్కటే.
మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజ. అయితే పూజ హెగ్డే మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసింది. జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలి.. చేసేది ఏమీ లేదు అని తెలిపింది పూజాహెగ్డే. మనం చేసే పని, తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉనా.. ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు అని చెప్పుకొచ్చింది పూజా..