‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై ఈసీకి ఫిర్యాదు

| Edited By: Anil kumar poka

Mar 13, 2019 | 7:09 AM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేశారు. 22న విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆపాలని దేవీబాబు ఆ ఫిర్యాదులో కోరారు. సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11వరకు ఈ చిత్రం విడుదలను […]

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై ఈసీకి ఫిర్యాదు
Follow us on

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేశారు. 22న విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆపాలని దేవీబాబు ఆ ఫిర్యాదులో కోరారు. సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని విఙ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.