రాడిసన్ బ్లూ పబ్.. రైడ్ వ్యవహారం ప్రస్తుతం టూ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ పబ్ పై పోలీసులు దాడి చేశారు. పబ్ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉండడం.. అందర్నీ షేక్ చేస్తోంది. దాంతో పార్టీలో పాలుగొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా ఆ పార్టీకి హాజరైన వారి లిస్టు టీవీ9 చేతికొచ్చింది. ఇక ఈ లిస్టులో ఉన్న 142 మంది లేట్ నైట్ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. వారిలో ఐదుగురు విదేశియులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ పార్టీకి హాజరైన వారిలో షార్ట్ ఫిల్మ్ నటులు కుషితా కల్లపు, లిషి గణేష్ ల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ముసారాంబాగ్లో ఉంటున్న వీళ్లిద్దరు కజిన్స్ . ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసిన వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరినీ కూడా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకుని అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే కునాల్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :