Sai Pallavi: రానా మాటలతో కొండంత దైర్యం వచ్చిందట.. ఎమోషనల్ అయిన సాయి పల్లవి

|

Jul 12, 2022 | 8:30 AM

సాయి పల్లవి.. ఇప్పుడు ఈపేరు టాలీవుడ్ , కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.

Sai Pallavi: రానా మాటలతో కొండంత దైర్యం వచ్చిందట.. ఎమోషనల్ అయిన సాయి పల్లవి
Sai Pallavi
Follow us on

సాయి పల్లవి(Sai Pallavi).. ఇప్పుడు ఈపేరు టాలీవుడ్ , కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అమ్మడు. తన సహజ నటనతో అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.నక్షలైట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి నటన అందరిని కట్టిపడేసింది.ఇటీవల వరుసగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ , విరాటపర్వం సినిమాలతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇప్పుడు ఈ భామ నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి అంతా చర్చిన్చుకుంటున్నారు. సాయి పల్లవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గార్గి . గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజిగా ఉంది సాయి పల్లవి. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.. సాయి పల్లవి మాట్లాడుతూ.. చిన్నతనంలో  ఏదైనా మంచి పని చేస్తే అమ్మానాన్నలకు చూపిస్తాం. అలా తమిళంలో చేసిన ఈ సినిమాను మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నారు. తమిళంలో సూర్యగారు .. ఉదయనిధి స్టాలిన్ గారు ఈ సినిమాను చూశారు. ఇంతమంచి సినిమా మిగతా భాషల్లోని ఆడియన్స్ కి చేరాలనే ఉద్దేశంతో తమ ప్రెస్ మీట్స్ లో ఈ సినిమాను గురించి మాట్లాడారు అని చెప్పుకొచ్చింది. అప్పుడు నేను రానా గారికి కాల్ చేసి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తారా? అని అడిగాను. ‘నువ్వు  సినిమా చేశావంటేనే .. ఆ సినిమాలో విషయం ఉంటుందనే సంగతి నాకు తెలుసు. ఈ సినిమా పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను అని దైర్యం ఇచ్చారని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి