
ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలు మైథలాజికల్ టచ్తో, డివైన్ వైబ్స్ను కలిగించి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ‘డివైన్ ట్రెండ్’ను అనుసరిస్తూ, ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ తాను ఏడేళ్లుగా పరిశోధన చేసిన అరిషడ్వర్గాల కాన్సెప్ట్తో ‘అరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం, ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించింది. ముఖ్యంగా, సినిమాలో చూపించిన నూతన పాయింట్, చివర్లో ఇచ్చిన గొప్ప సందేశానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
కృష్ణుడి ఎంట్రీ: క్లైమాక్స్ దగ్గర కృష్ణుడి ఆగమనం, అరిషడ్వర్గాల గురించి ఆయన చెప్పే సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సందేశాత్మక చిత్రంగా ‘అరి’ని మలిచినందుకు దర్శకుడు జయశంకర్పై ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ట్: మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ సైతం సినిమాలోని చివరి 20 నిమిషాల క్లైమాక్స్, సందేశం గురించి ప్రత్యేకంగా కొనియాడారు.
విభిన్న కాస్టింగ్, నిశ్శబ్ద విజయం
అరిషడ్వర్గాల కాన్సెప్ట్ను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు విభిన్న పాత్రలతో సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనే దర్శకుడి ప్రయత్నం విజయవంతమైంది.
వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి వంటి నటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోసి సినిమా విజయానికి తోడ్పడ్డారు.
సోషల్ మీడియాలో కూడా ‘అరి’ చిత్రంపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. మొత్తానికి, దర్శకుడు జయశంకర్ ‘పేపర్ బాయ్’ తర్వాత ‘అరి’ వంటి గొప్ప సందేశాత్మక చిత్రాన్ని అందించి, వరుసగా రెండు మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..