Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం.. షాక్‌లో మెగా ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలంటూ..

|

Sep 10, 2021 | 11:08 PM

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరంజీవి మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ప్రాణ గండం తప్పింది.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం.. షాక్‌లో మెగా ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలంటూ..
Sai Dharam Tej
Follow us on

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరంజీవి మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ప్రాణ గండం తప్పింది. ప్రస్తుతం ఆయన మాధాపూర్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఆయన హెల్మెట్ వేసుకుని ఉండటంతో పెను ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు.  అయితే సాయి ధరమ్‌కు భుజం దగ్గర బోన్ ఫ్రాక్షర్ అయినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ను మాధాపూర్ మెడ్‌కవర్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు.. మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.  సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న కథనాలతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.


ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు పలువురు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి చేరుకున్న వారిలో చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి ధరమ్ తేజ్.. Watch Video

Also Read..

Sai Dharam Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. మరిన్ని వివరాలు

యూపీలో నామమాత్రంగా కోవిడ్ ప్రభావం.. 33 జిల్లాల్లో కేసుల సంఖ్య నిల్.. కారణం ఇదేనా?