
మాస్ మహారాజా ఈసారి రావణాసుర అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు మాస్ రాజా. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్వర్క్స్పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలు సెన్సార్ బోర్డు రివ్యూ ఇచ్చింది.
రీసెంట్ గా రావణాసుర సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వలన దీనికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా పై చిత్రయూనిట్ చాలా ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారని టాక్. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్గా విడుదల కానుంది.