AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ డిమాండ్.. అక్కినేని వారబ్బాయితో జతకట్టనున్న రష్మిక..

అంతేకాకుండా ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం చిత్రంలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇక ఇప్పుడు రష్మిక అక్కినేని వారబ్బాయితో జతకట్టనుందట.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ డిమాండ్.. అక్కినేని వారబ్బాయితో జతకట్టనున్న రష్మిక..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2022 | 3:16 PM

Share

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్. ఇటీవల పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాందించుకుంది ఈ చిన్నది. హిందీలో యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇక తెలుగులో పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాకుండా ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం చిత్రంలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇక ఇప్పుడు రష్మిక అక్కినేని వారబ్బాయితో జతకట్టనుందట. వీరిద్దరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. అయితే పరశురామ్ తన తర్వాతి చిత్రాన్ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో తెరకెక్కించనున్నట్లు గత కొంత కాలంగా టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో రష్మిక కథానాయికగా నటించనుందట. పరశురామ్ తెరకెక్కించిన సూపర్ హిట్ గీతా గోవిందం మూవీలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తన మూవీలో నేషనల్ క్రష్ ను ఎంపిక చేశాడట. చైతూతో మొదటిసారి రష్మిక జతకట్టనుంది. ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 11న హిందీతోపాటు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.