Megastar Chiranjeevi: అన్నయ్య అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. వాల్తేరు వీరయ్య మేకర్స్ స్పెషల్ ట్రీట్..

|

Nov 20, 2022 | 7:37 PM

మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా.. డైరెక్టర్ బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత క్యూరియాసిటిని పెంచేసింది.

Megastar Chiranjeevi: అన్నయ్య అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. వాల్తేరు వీరయ్య మేకర్స్ స్పెషల్ ట్రీట్..
Megastar Chiranje Evi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళీ చిత్రం లూసీఫర్ రీమేక్‏గా వచ్చిన ఈ మూవీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ప్రస్తుతం చిరు చేతిలో మరో మెడు మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వాల్తేరు వీరయ్య. మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా.. డైరెక్టర్ బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇక తాజాగా అన్నయ్య అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు మేకర్స్.

ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ నవంబర్ 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానున్నట్లు తెలిపారు. ఊర మాస్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు. చిరంజీవి గళ్ళ లుంగీలో కనిపించి చాలా కాలం అయ్యింది. ఈ చిత్రంలో ముఖ్యంగా ఈ పార్టీ నంబర్‌ లో మెగాస్టార్ వింటేజ్ మాస్ అవతార్‌ ని చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా వున్నారు. పోస్టర్ లో చిరంజీవి గెటప్, హావభావాలు మెగాస్టార్ ముఠా మేస్త్రి, మరికొన్ని మాస్ డ్యాన్స్‌ల జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. కలర్ ఫుల్ చొక్కా లుంగీ ధరించి.. మెడలో బంగారం గొలుసులు, చెవి పోగు, చేతికి గడియారం, బ్లాక్ బూట్స్.. ఇలా మాస్ అప్పీరియన్స్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు మెగాస్టార్.

ఈ పాటలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది. మాస్ డ్యాన్స్ నంబర్ ‌లను స్కోర్ చేయడంలో నిపుణుడైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో ఫుట్ ట్యాపింగ్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఇందులో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.