Nidhi Agerwal: కుక్క తప్పిపోయింది.. పట్టిస్తే లక్ష రూపాయాలు రివార్డ్.. ఇస్మార్ట్ బ్యూటీ పోస్ట్ వైరల్..

|

May 13, 2021 | 9:46 AM

Nidhi Agerwal :  'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్‌ మజ్ను' సినిమాలో నటించింది.

Nidhi Agerwal: కుక్క తప్పిపోయింది.. పట్టిస్తే లక్ష రూపాయాలు రివార్డ్.. ఇస్మార్ట్ బ్యూటీ పోస్ట్ వైరల్..
కరోనా బాధితులను ఆదుకునేందుకు  నిధి అగర్వాల్  ముందుకొచ్చింది. 'డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ . 
Follow us on

Nidhi Agerwal :  ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమా డిజాస్టర్స్ గా మిగిలిపోయినా.. నిధికి మాత్రం అవకాశాలు తలుపు తట్టాయి.  ఈ క్రమంలో  ఎనర్జిటిక్ స్టార్ రామ్… మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ దిశ మారిపోయింది. ఈ సూపర్ హిట్ సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ మంచి ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిధి తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే శింబు సరసన ఈశ్వరన్ సినిమాలో, జయం రవి భూమి చిత్రంతో నిధి అగర్వాల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Nidhi Agerwal

ఇదిలా ఉంటే తాజాగా నిధి తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. అందులో ఓ పెట్ తప్పిపోయిందని.. దానిని పట్టిస్తే లక్ష రూపాయాల రివార్డ్ కూడా లభిస్తునట్లుగా ఉంది. అందులో వారి కాంటాక్ట్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా ఉన్నాయి. కేవలం ఒక కుక్కను పట్టిస్తే లక్ష రూపాయాలు ఇవ్వడం ఏంటీ అని నిధి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిధి అగర్వాల్ ఇప్పుడు గల్లా అశోక్ హీరోగా వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: కాబోయేవాడి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన సురేఖా వాణి కూతురి.. నెటిజన్లతో ముచ్చటించిన సుప్రిత..

Singer Sunitha: ఇది చూసి నేను షాక్‌కు గురయ్యా.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సింగర్‌ సునీత

అతను అడిగాడు.. నేను ఓకే అన్నాను..! మిహికబజాజ్.. రానాకు ఒకే చెప్పి నేటికి ఏడాది.. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్