Tollywood: ఒకే వేదిక పై స్టార్ హీరోలు.. వైరల్ అవుతోన్న రేర్ ఫోటో.. ఇందులో మెగాస్టార్ ఏం చేస్తున్నారో చూడండి

|

Feb 15, 2023 | 6:33 PM

యంగ్ హీరోల జనరేషన్ మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ అదే స్పీడ్ తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

Tollywood: ఒకే వేదిక పై స్టార్ హీరోలు.. వైరల్ అవుతోన్న రేర్ ఫోటో.. ఇందులో మెగాస్టార్ ఏం చేస్తున్నారో చూడండి
Tollywood
Follow us on

స్టార్ హీరోలు ఒకే వేదిక మీద కనిపించడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అభిమానులంతా హీరోలందరిని కలిపి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. యంగ్ హీరోల జనరేషన్ మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ అదే స్పీడ్ తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు ముఖ్యంగా చెప్పుకోవాలి. కుర్రహీరోలతో పోటీపడుతూ.. ఇప్పటికీ ఈ సీనియర్స్ తమ సత్తా చాటుతున్నారు. అయితే వీరి మధ్య మంచి ఫెండ్ షిప్ ఉన్నప్పటికీ..అయితే ఈ సీనియర్ హీరోలంతా కలిసి ఉన్న ఫోటోలు చాలా అరుదు. తాజాగా అలాంటి అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే లేటెస్ట్ గా వైరల్ అవుతోన్న ఫొటోలో బాలకృష్ణ ఒక్కరే మిస్ అయ్యారు. ఇక ఈ ఫొటోలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో పాటు రాజశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. ఇంతకు ఈ ఫోటో ఎక్కడిదంటే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో వందరోజుల ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, నాగార్జున, కృష్ణ, రాజశేఖర్ హాజరయ్యారు. వీరితో పాటు రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రేర్ ఫోటోను సదురు హీరోల ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.Chiranjeevi