
Aadhi Pinisetty: ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటున్నారు ఆది పినిశెట్టి. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్లాప్. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాల పై తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పిస్తున్నారు. పృద్వి ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. క్లాప్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 11న సోనీలివ్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భం గా గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర టీజర్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది.
అనంతరం హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, క్లాప్ జర్నీ మొదలయి రెండున్నర సంవత్సరాలైంది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. నిర్మాతల సపోర్ట్ తో విడుదలకు వచ్చాం. సోనీలివ్ లో ప్రదర్శన కాబోతుంది అని అన్నారు. నేను ఈ కథను విన్నప్పుడు ప్రేక్షకుడి గా ఫీలయి విన్నాను. `రంగస్థలం` తర్వాత ఈ కథ విన్న వెంటనే చేసేద్దామని నిర్మాతలకు చెప్పా. ఇందులో కమర్షియల్ అంశాలు లేకపోయినా ఆడియన్కు బాగా నచ్చుతుందని చెప్పగలను. చాలా కోణాలు ఇందులో దర్శకుడు చూపించాడు. నేను ఆకాంక్ష ఇద్దరమూ స్పోర్ట్స్ పర్సన్స్ గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్ ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం. దర్శకుడు నిజాయితీగా తీశాడు. అంతే నిజాయితీ గా మేమంతా నటించాం. టెక్నీషియన్స్ అలానే పనిచేశారు. ఇళయరాజా గారి రీరికార్డింగ్ సినిమాకు బలం. ఒక సీన్ ను ఎలా వెలివేట్ చేయాలో ఆయన ఆర్.ఆర్.లో బాగా చూపించారు. మంచి సినిమా తీయాలనే పట్టుదల నిర్మాతల్లో కనిపించింది అని అన్నారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. క్లాప్ మూవీలో నటించడం గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఆది చాలా ఓపికతో చేశారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. చాలా ఎమోషన్స్ ఇందులో వున్నాయి. నవ్వులు, బాధలు వంటి అంశాలున్నాయి. ఈ చిత్రం ఓటీటీలో విడుదలవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :