
శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (ఆగస్టు 16) చాలా మంది తల్లి దండ్రులు తమ బిడ్డలను కృష్ణుడిగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే కృష్ణుడి వేషంలో ఉన్న ఓ టాలీవుడ్ సెలబ్రిటీ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. పై ఫొటోలో ఉన్న పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. తెలంగాణకు చెందిన ఈ అబ్బాయి దర్శకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పట్టభద్రుడైన అతను మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ఆరంభించాడు. దర్శకుడిగా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు . ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ, విలన్ గానూ, సహాయకనటుడిగానూ మెప్పించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెతో దూసుకెళుతోన్న ఈ సెలబ్రిటీ మరెవరో కాదు పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్.
ఈ మధ్యన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కంటే నటుడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు. అతను దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తోంది. దీని తర్వాత మరే కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అయితే ఇటీవల హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీతో మరోసారి కథానాయకుడిగా మన ముందుకు రానున్నాడు. ఇందులో ఇషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘జయ జయ జయహే’ మూవీకి ఇది రీమేక్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
Happy Varalakshmi Vratham from us to you ❤️
త్వరలోనే నవ్వుల విందుకి ముహూర్తం కాయం చేద్దాం … 🥳#OmShantiShantiShantihi ✨#TharunBhascker @yourseesha @ActorBrahmaji @ARSajeev2794 @jaymkrish @srujanyarabolu1 @Soriginals1 @adityapittie @in10_media @MovieVerseIndia… pic.twitter.com/g2dKfDmZ0D
— S Originals (@SOriginals1) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.