AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె.

చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2024 | 10:17 AM

Share

చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఇంతకు ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? నటన పరంగానే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అదా శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే అదా శర్మ ఇటీవలే దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా  రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..