అమ్మకు గోరుముద్దలు తినిపిస్తున్న ఈ చిన్నారి.. బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో నటించింది ఈ బ్యూటీ..

|

Aug 19, 2024 | 7:39 PM

తాజాగా ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చింది. తన అందంతో కుర్రాళ్లను కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి నటించింది ఆ అమ్మడు. 

అమ్మకు గోరుముద్దలు తినిపిస్తున్న ఈ చిన్నారి.. బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో నటించింది ఈ బ్యూటీ..
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమ ఫెవరెట్ హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ ఫోటోలను రకరకాలుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చింది. తన అందంతో కుర్రాళ్లను కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి నటించింది ఆ అమ్మడు.

పై ఫొటోలో తల్లితో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అమ్మకు గోరుముద్దలు తినిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామరస్ బ్యూటీ.. ఎవరో కాదు యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వాని చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2007లో పూరీజగన్నాధ్ తీసిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో నటించింది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమాలో నటించింది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. తమిళ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. హన్సికను తమిళ చిత్ర పరిశ్రమ అభిమానులు కుట్టి కుష్బూ అని పిలుస్తారు. నటి హన్సిక మోత్వానీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. 2020 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటించింది. హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఓ డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..