చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.?

|

Apr 25, 2024 | 7:01 PM

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. పై ఫొటోలో చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. చూడటానికి చాలా అందంగా ఉంది ఆ చిన్నారి. ఇంతకు ఇప్పుడు ఆ అమ్మడు ఎలా ఉందో చూడండి.

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Chiranjeevi
Follow us on

చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా, హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు తేజ. అలాగే కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా మరి సినిమాలు చేస్తుంది. అలాగే ఇప్పుడు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. పై ఫొటోలో చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. చూడటానికి చాలా అందంగా ఉంది ఆ చిన్నారి. ఇంతకు ఇప్పుడు ఆ అమ్మడు ఎలా ఉందో చూడండి.

పై ఫొటోలో చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎవరో కాదు ఆ చిన్నారి పేరు నిత్యా శెట్టి. 2000 సంవత్సరంలో వచ్చిన దేవుళ్ళు సినిమాలో నటించి మెప్పించింది నిత్యా శెట్టి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. పై ఫోటో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమాలో సీన్. అంజి సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించింది

నిత్యా శెట్టి హీరోయిన్ గాను కొన్ని సినిమాల్లో నటించింది. దాగుడుమూత దండాకోర్, పడేసావే, నువ్వు తోపురా, ఓ పిట్ట కథ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో నటించడం లేదు. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే నిత్యా శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.