
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? బాక్సింగ్ డ్రెస్ లో చూసి ఠక్కున అబ్బాయి అనుకునేరు. ఆ అమ్మాయి ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. సాయి పల్లవిలా మేకప్ లేకుండా నటిస్తూనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. అలా తాజాగా ఈ అమ్మడు నటించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు థియేటర్లు, ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ ట్రెండింగ్ అవుతోంది. కేరళకు చెందిన ఈ అందాల తార మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. అదే సమయంలో చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డీఎన్ఏ (తెలుగులో ఓమై బేబీ) మూవీ హీరోయిన్ నిమిషా సజయన్.
జులై 18 థియేటర్లలో రిలీజైన ఓ మై బేబీ సినిమా ఒక్క రోజు గ్యాప్ లో అంటే జులై 19న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది నిమిషా సజయన్. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, చిన్నా (తెలుగులో చిన్నా), జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి సినిమాలతో పాటు పోచర్, డబ్బా కార్టెల్ తదితర వెబ్ సిరీసులతోనూ ఆడియెన్స్ ను మెప్పించింది. నిజ జీవితంలో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిషా రీల్ లైఫ్ లోనూ మేకప్ వేసుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి