
బలగం సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల మనసులు దోచేశాడు వేణు. కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి ఆతర్వాత దర్శకుడిగా మారాడు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన వేణు, ఆతర్వాత కమెడియన్ గా రాణించాడు. సినిమాలతో పాటు జబర్దస్త్ లాంటి కామెడీ షోలో ఎన్నో స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు. ఇక దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా బలగం ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బలగం లాంటి సినిమా చేసిన తర్వాత వేణు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్లో అందరూ షాక్ అయ్యాం..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వచ్చింది.. ఆ తర్వాత ఆమె కాదు కీర్తిసురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆమె కాదు మృణాల్ ఠాకూర్ ని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ అంటున్నారు.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
ఆమె మరెవరో కాదు.. ప్రేమలు , డ్యూడ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న మమిత బైజు. ఈ చిన్నదానికి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ధనుష్ నటించిన కర సినిమాలో నటించింది. అలాగే దళపతి విజయ్ నటించిన జననయగాన్ సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది డైరెక్ట్ గా తెలుగులోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. ఎల్లమ్మ సినిమాలో మమిత హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలో మమిత హీరోయిన్ గా నటిస్తుందా.? లేదా.? అన్నది సినిమా టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు డౌటే.. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి