Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్

Rare Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన..

Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్
Chiru Rare Pic

Updated on: Jun 13, 2021 | 1:06 PM

Rare Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన కాంబినేషన్స్ లోని ఫోటోలు వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతాయి. తాజాగా దక్షిణాది స్టార్ హీరోలు ఒకే ఫేమ్ లో ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో మెగా స్టార్ చిరంజీవి, సూపర్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, అందాల నటుడు శోభన్ బాబు లు ఉన్నారు. ఈ ఫోటో 33 ఏళ్ల క్రితంది. చిరంజీవి హీరోగా హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అనేక సెంటర్స్ లో శతదినోత్సవం వేడుకలు జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవి, విజయబాపినీడులను అభినందించేందుకు కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు.

కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబులతో చిరంజీవి, విజయ బాపినీడు మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు. దీంతో ఆ సమయంలో వారు బిజీగా ఉన్నా సరే సక్సెస్ వేడుకకి వచ్చారట. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

1988 జూన్ 10న విడుదల అయిన ఖైదీ నెం.786 సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి జోడీగా భానుప్రియ నటించింది. మోహన్ బాబు, కోట శ్రీనివాస రావు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమాలో గువ్వా గోరింకతో పాట ఫంక్షన్లలో వినిపిస్తూనే ఉంటుంది.

Also Read: TV Anchors: వెండి తెరపైన సత్తా చాటిన టాప్ బుల్లితెర యాంకర్స్..(photo gallery)

Loading...
Unable to load recommendations.
Follow Us