‘అమ్మ రాజ్యం’ రిలీజ్ ఎప్పుడు..? సెన్సార్ నో సర్టిఫికెట్..!

| Edited By:

Nov 30, 2019 | 5:48 PM

రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు. గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ వర్మ […]

అమ్మ రాజ్యం రిలీజ్ ఎప్పుడు..? సెన్సార్ నో సర్టిఫికెట్..!
Follow us on

రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు.

గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ వర్మ ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించినా.. సెన్సార్ బోర్డు వ్యతిరేకత వల్ల రిలీజ్ కాలేదు. దీంతో.. హైకోర్టుకు వెళ్లాడు వర్మ. ఈ వివాదంపై స్పందించిన హైకోర్టు వారం రోజుల్లోగా సినిమాను పరిశీలించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం ఇచ్చింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి.. అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కి హైకోర్టు సూచించింది. అయితే.. ఇప్పట్లో.. ఈ సినిమా రిలీజ్‌ అయ్యేలా కనిపించడంలేదు. మరి వర్మ ఇప్పుడు ఏం చేస్తాడో.. చూడాలి.