AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Apte: ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయిన రాధికా ఆప్టే.. నీళ్లు కూడా లేక ఇబ్బంది

Radhika Apte: ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయిన రాధికా ఆప్టే.. నీళ్లు కూడా లేక ఇబ్బంది

Rajeev Rayala
|

Updated on: Feb 02, 2024 | 2:48 PM

Share

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఫ్లైట్‌లో భువనేశ్వర్ వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయారు. విమానం కోసం గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటిలేషన్‌ సరిగా లేకపోవడంతో సిబ్బందితో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఏరోబ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ నటి రాధికా ఆప్టే కూడా ఉన్నారు.



ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఫ్లైట్‌లో భువనేశ్వర్ వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయారు. విమానం కోసం గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటిలేషన్‌ సరిగా లేకపోవడంతో సిబ్బందితో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఏరోబ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ నటి రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు తాను ఫ్లైట్ ఎక్కాల్సి ఉందనీ ప్రస్తుతం 10.50 నిమిషాలు అవుతున్నా ఇంకా విమానం ఎక్కలేదనీ రాసుకొచ్చారు. కానీ తాము ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు సిబ్బంది చెబుతున్నారట. ప్రయాణికులు అందరినీ ఏరోబ్రిడ్జి ఎక్కించి లాక్ చేశారు అని రాధికా ఆప్టే తెలిపారు. ప్రయాణికుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, వీరంతా గంటల తరబడి బందీ అయ్యారని ఆమె తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరవలేదని, విమానం రాకపై సిబ్బందికి ఖచ్చితంగా సమాచారం లేదని పోస్టులో తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Jan 15, 2024 09:18 AM