
‘ఆదిపురుష్’ మూవీకి వరుస వివాదాలు చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలనుకున్న ఫ్యాన్స్.. చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో.. దర్శకుడు ఓం రౌత్, చిత్ర బృందంపై మండిపడుతున్నారు. తమ హీరోను సరిగ్గా చూపించలేదని కొందరు, డైలాగ్స్ బాగోలేవని మరికొందరు, విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉందని గ్రాఫిక్స్ లవర్స్.. ఇలా అన్ని రకాలుగా ఫ్యాన్స్ నుంచి ఆదిపురుష్ చిత్ర యూనిట్ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యంలో ఆ చిత్ర రచయిత మనోజ్ ముంతశీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఆదిపురుష్ రామాయణం కాదని.. దాని నుంచి తాము కేవలం ప్రేరణ పొంది కథను రాసుకున్నామని’ మనోజ్ తెలిపారు. ఈ విషయాన్ని సైతం సినిమాకి ముందుగా డిస్క్లైమర్లో కూడా ప్రస్తావించామన్నారు. మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశామన్న ఆయన.. ఇది సంపూర్ణ రామాయణం కూడా కాదని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ యుద్ధకాండను ఇన్స్పిరేషన్గా తీసుకుని.. చిత్రంలో చూపించామని చెప్పారు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన సూచించారు.
కాగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కింది ‘ఆదిపురుష్’. ఇందులో కృతి సనన్ హీరోయిన్. రావణుడి క్యారెక్టర్లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్ కాగా, అజయ్-అతుల్ సంగీతాన్ని అందించారు. అటు ఈ సినిమా రమొదటి రెండు రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.