Rashi Khanna: రాశీ ఖన్నా క్రేజీ పోస్ట్.. ఇది మీ మనసును తాకుతుందంటూ కామెంట్.. విషయమేంటంటే..

ఈ క్రమంలోనే తిరుచిత్రంబలం విజయం పై స్పందించింది హీరోయిన్ రాశీఖన్నా. అభిమానులకు ధన్యావాదలు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేసింది.

Rashi Khanna: రాశీ ఖన్నా క్రేజీ పోస్ట్.. ఇది మీ మనసును తాకుతుందంటూ కామెంట్.. విషయమేంటంటే..
Rashi Khanna

Updated on: Aug 20, 2022 | 5:08 PM

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తుంది రాశీఖన్నా (Rashi Khanna). ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది.. తాజాగా తిరుచిత్రంబలం మూవీతో మరోసారి ఆడియన్స్‏ను అలరిస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్.. రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తిరుచిత్రంబలం విజయం పై స్పందించింది హీరోయిన్ రాశీఖన్నా. అభిమానులకు ధన్యావాదలు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేసింది.

తిరుచిత్రంబలం సినిమాను చూశారా ?.. చిత్రం చూసి ప్రేమను కురిపించిన వారికి ధన్యవాదాలు. ఇప్పటివరకు చూడవారు చూడండి. ఇది కచ్చితంగా మీ మనసును హత్తుకునే సినిమా. నేను హామీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొస్తూ ఈ మూవీ నుంచి అందమైన పిక్ షేర్ చేసింది. ఒక సినిమా వెయ్యి భావోద్వేగాలను చెప్పగలిగినప్పుడు ఇంకా మాటలు అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో రాశీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా వీరిద్దరి జోడిగా.. అందంగా ఉందని.. స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు దక్షిణాదిలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రాశీ ఖన్నా… మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టబోతుంది. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.