
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు మురళి మోహన్. అలాగే రియల్టర్, రాజకీయ నాయకుడిగా పలు రంగాలలో అపారమైన విజయాన్ని సాధించారు. తెలుగు సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రస్థానం, విజయ రహస్యాలు, ఇతర నటులు ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. సినీ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ ప్రాముఖ్యతను తెలియజేశారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజాల కాలం నుంచి నేటి వరకు పరిశ్రమలో ఎంతోమంది విజయం సాధించారని, అయితే హరనాథ్, రాజబాబు వంటి కొందరు నటులు వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక నిర్వహణ లోపాలతో ఇబ్బందుల పాలయ్యారని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. “ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు” అనేది ఈ అనుభవాల నుండి తాను నేర్చుకున్నానని తెలిపారు. గత తరంలో జరిగిన పొరపాట్లను నేర్చుకుని, తర్వాతి తరం హీరోలు ఆర్థికంగా ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని, సంపాదించిన డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా సురక్షితంగా ఉండాలో వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
కాంతారావు, పద్మనాభం వంటి దిగ్గజాలు కూడా చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా నష్టాలను చవిచూశారని మురళీ మోహన్ తెలిపారు. “సినిమా విజయం మన చేతుల్లో ఉండదు, కానీ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి” అని ఆయన అన్నారు. తమ నిర్మాణ సంస్థకు ఆర్థిక దన్నుగా నిలిచింది తన సోదరుడు కిషోరే అని మురళీ మోహన్ చెప్పారు. ఆడిటింగ్లో నిష్ణాతుడైన కిషోర్, ప్రొడక్షన్ బడ్జెట్ను కట్టుదిట్టంగా నిర్వహించేవారని, అనవసర ఖర్చులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేవారు కాదని వివరించారు. సినిమా విడుదల కంటే ముందే సేఫ్ అవ్వడంపై కిషోర్ దృష్టి సారించేవారని, దీనివల్ల తమకు నష్టాలు రాలేదని పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
మహానటి సావిత్రితో తన పని అనుభవాలను పంచుకుంటూ, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “భారతంలో ఒక అమ్మాయి” చిత్రంలో ఆమె తన తల్లి పాత్రలో నటించారని గుర్తుచేసుకున్నారు. ఒక సన్నివేశంలో సావిత్రి ఇచ్చిన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, ఆమె నటనలోని గొప్పదనాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని వివరించారు. ఆమె తన కాళ్ళకు దండం పెట్టించుకున్న విషయాన్ని పంచుకుంటూ, “మహానటి మహానటియే” అని ప్రశంసించారు. సావిత్రి తన చివరి రోజుల్లో వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, సెట్కు వస్తే తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచేవారని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?