అమ్మను వదిలి 4 రోజులైనా ఉండలేకపోయావా ఇర్ఫాన్
నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. గత శనివారమే అతడి తల్లి సయిదా బేగం.. రాజస్థాన్లోని జైపుర్లో కన్నుమూశారు. మన దగ్గర లాక్డౌన్ నిబంధనలు అమలవుతుండటంతో ఇర్ఫాన్ తన తల్లిని కడసారి కూడా చూడలేకోయాడు. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతడి స్నేహితులు తెలిపారు. ఇలా ఆ ఫ్యామిలిలో వరుస మరణాలు సంభవించడం బంధువులు, సన్నిహితుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. 54 ఏళ్ల ఇర్ఫాన్.. కొన్నేళ్లుగా […]
నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. గత శనివారమే అతడి తల్లి సయిదా బేగం.. రాజస్థాన్లోని జైపుర్లో కన్నుమూశారు. మన దగ్గర లాక్డౌన్ నిబంధనలు అమలవుతుండటంతో ఇర్ఫాన్ తన తల్లిని కడసారి కూడా చూడలేకోయాడు. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతడి స్నేహితులు తెలిపారు. ఇలా ఆ ఫ్యామిలిలో వరుస మరణాలు సంభవించడం బంధువులు, సన్నిహితుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
54 ఏళ్ల ఇర్ఫాన్.. కొన్నేళ్లుగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్తో ఇబ్బందిపడుతున్నారు. అతడికి ఈ వ్యాధి వచ్చినట్లు 2018లో తెలిసింది. అప్పుడే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిపారు ఇర్ఫాన్.
వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఇర్ఫాన్ చేసిన ట్వీట్ సారాంశం:
“నా జీవితంలో అకస్మాత్తుగా ఇలా జరిగింది. ఇలానే ముందుకు వెళ్లాలి. చివరి రోజులు దీనితోనే సాగిపోవాలి. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే డిసీజ్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కానీ నా చుట్టూ అందరూ ప్రేమించే మనుషులే ఉన్నారు. నాకు బ్రతుకుపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని నూరిపోస్తున్నారు” అని అప్పట్లో ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.
ఈ వ్యాధి ఉందని తేలిన తర్వాత లండన్లో ఏడాది పాటు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు ఇర్ఫాన్. అనంతరం ముంబైలోని డాక్టర్స్ అబ్జర్వేషన్స్ లో ఉన్నారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్ సమయంలోనూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.