Major: సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న మేజర్.. చిత్రయూనిట్ పై ప్రశంసలు..
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న మేజర్ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి కీలకపాత్రలలో నటిస్తున్నారు. 26/11 దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ మూవీని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు.. U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. మేజర్ ఇన్నికృష్ణన్ జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పిన విధానం అద్భుతంగా ఉందని చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. అలాగే అడివి శేష్ నటన బాగుందని.. ఈ సినిమా అద్భుతమంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురింపించారట. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో జూన్ 3న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను విడుదల తేదీ కంటే ముందే దేశంలోని 9 ప్దధాన నగరాల్లో ప్రీవ్యూస్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రముఖ బుక్ మై షో తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా ప్రివ్యూస్ చూడాలనుకున్నవారు బుక్ మై షోలో టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది..
ట్వీట్..
It’s U/A for #MajorTheFilm ??
India, gear up to watch the story of our Nation’s braveheart on the Big Screens from June 3rd with your family and friends ?#Major #MajorOnJune3rd pic.twitter.com/dRcwyg1R7X
— GMB Entertainment (@GMBents) May 24, 2022