డైరెక్టర్‌పై చెర్రీ సీరియస్.. జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచన!

| Edited By:

Feb 24, 2020 | 9:12 AM

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫొటోలు లీక్ కావడంతో.. కొరటాలపై చరణ్ సీరియస్ అయ్యాడని పలు వార్తలు ట్రోల్ అవుతోన్నాయి. ఇక నుంచి షూటింగ్‌లకి ఎవరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకూడదని..

డైరెక్టర్‌పై చెర్రీ సీరియస్.. జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచన!
Follow us on

ఓ డైరెక్టర్‌పై చెర్రీ సీరియస్ అయ్యాడట. అంతేకాదు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు కూడా చేసినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో భాగంగా బిజీగా ఉన్నాడు. అటు మెగాస్టార్ స్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమాకి కూడా నిర్మాతగా బాధ్యతలు వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ కొరటాల శివ మూవీ యూనిట్‌పై సీరియస్ అయ్యాడని ప్రస్తుతం ప్రచారం జరుగుతంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతంది. 50 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి చిరు పిక్స్, వీడియోలు లీక్ అయ్యాయి. షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఎవరో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కాసేపటికే ఇవి వైరల్ అయ్యాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫొటోలు లీక్ కావడంతో.. కొరటాలపై చరణ్ సీరియస్ అయ్యాడని పలు వార్తలు ట్రోల్ అవుతోన్నాయి. ఇక నుంచి షూటింగ్‌లకి ఎవరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకూడదని నిర్ణయం తీసుకోనున్నారని, దీనికి సంబంధించి శివను కూడా జగ్రత్తలు తీసుకోవాలంటూ చరణ్ కోరినట్లు తెలుస్తోంది.

కాగా.. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది. అందులో ఎర్ర కండువాతో చిరంజీవి లుక్ కేక పుట్టిస్తోంది. ఇక ఈ మూవీ కోసం మెగాస్టార్ కాస్త సన్నబడ్డట్లు కూడా ఆ లుక్‌లో అర్థమవుతోంది. ఈ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ‘‘వావ్ సూపర్.. మెగాస్టార్ మీరు కేక.. 20సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు అలానే ఉన్నారు బాసూ’’.. అని కామెంట్లు పెడుతున్నారు.

Read More: తన భర్త సంపాదనపై.. పంచ్ వేసి తప్పించుకున్న సుమ