మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో.. డైరెక్టర్ మెహర్ రమేష్ కలిసి పని చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుందనే వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కోసం మెహర్ రమేష్ ఓ కథను సిద్ధం చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితులు అన్నీ మారిపోయాయి. కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే చిరంజీవి చేయాల్సిన సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో మెహర్ రమేష్తో సినిమా చేయాలంటే చాలా సమయమే పట్టేలా ఉంది.
దీంతో మెహర్ చరణ్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని టాక్. అయితే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్ అని టాక్ నడుస్తోంది. ఈ మధ్య చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెబ్ సిరీస్ని నిర్మిస్తుంది. ఇప్పుడు మెహర్ కూడా వెబ్ సిరీస్కి సంబంధించిన స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్నారంట. దీన్ని చరణ్, సుష్మిత నిర్మిస్తారట. మరి ఇదంతా నిజమో.. ఫేక్ వార్తనో తెలియాలంటే ఆగాల్సిందే.
Read More: మరో మంత్రికి కరోనా పాజిటివ్..