
బుల్లి తెరపై స్టార్ హీరోయిన్ హీనా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న హీనా ఖాన్ .. ఇప్పటికి కీమోథెరపీ సెషన్లను పూర్తి చేసుకుంది. అయితే ఈ సెషన్లు పూర్తయిన తర్వాత కూడా హీనా ఖాన్ కీమోథెరపీ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటోంది. ఇటీవల హీనాఖాన్ తన తల్లి చేయి పట్టుకున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న ఆమె గోళ్లను చూసి కొంతమంది అభిమానులు రకరకాల కామెంట్స్ చేశారు. రంజాన్ నెలలో నమాజ్ చేసే సమయంలో గోర్లకు పాలిష్ ఉండకూడదు అని ఒక నియమం ఉంది. అది గుర్తు చేస్తూ హీనా ఖాన్ ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. రకరకాలుగా వ్యాఖ్యానించారు. హీనా ఖాన్ తన గోర్ల రంగుపై వస్తున్న కామెంట్స్ కు స్పందించింది.
తాను తన గోర్లకు ఎటువంటి నెయిల్ పాలిష్ వేసుకోలేదని చెప్పింది. అంతేకాదు తన గోర్లు ఇలా కావడానికి కారణం క్యాన్సర్ చికిత్సకోసం తీసుకున్న చికిత్స వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని వెల్లడించింది. తాను తీసుకుంటున్న చికిత్స కారణంగా గోర్లు ఎండిపోయాయి. కొన్నిసార్లు రాలిపోతున్నాయి అని తెలిపింది.
హీనా ఖాన్ తన గోళ్ల చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. చాలా మంది తన గోళ్ల గురించి అడుగుతున్నారు. మీరు మాత్రమే కాదు.. తన దగ్గర ఉన్నవారు కూడా తన గోర్లను చూసి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే నేను నా గోర్లకు ఎలాంటి నెయిల్ పాలిష్ వేసుకోలేదని చెబుతున్నాను. నేను నెయిల్ పాలిష్ లేకుండా నమాజ్ చేస్తాను. అయితే ఇప్పుడు కనిపిస్తున్న తన గోర్ల రంగు మారిపోవడానికి కారణం కీమోథెరపీ దుష్ప్రభావం అని చెప్పింది. ”
క్యాన్సర్ కు తీసుకుంటున్న చికిత్స కారణంగా తన గోర్లు పెళుసుగా, పొడిగా మారాయి. వీటి రంగు మారిపోయాయి. కొన్నిసార్లు గోళ్లు విరిగి వాటంతట అవే రాలిపోతాయి. అయితే ఇదంతా తాత్కాలికమే.. బాడ్ లో గుడ్ ఏమిటంటే తాను నెమ్మదిగా కోలుకుంటున్నానని చెప్పింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో హీనా ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తన కీమోథెరపీ సెషన్లు పూర్తయ్యాయని, ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన ఇతర చికిత్సలను తీసుకుంటున్నానని వెల్లడించింది. క్యాన్సర్ తో పోరాడుతున్న హీనా ఖాన్ బుల్లి తెరపై కనిపిస్తూనే ఉంది. ఇటీవల హీనా ఖాన్ సోనీ టీవీలోని రియాలిటీ షో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’లో పాల్గొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..