‘లవ్‌ స్టోరీ’ రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి

| Edited By:

Oct 11, 2020 | 11:41 AM

నాగచైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ప్రేమ కథా చిత్రం లవ్‌ స్టోరీ. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది.

లవ్‌ స్టోరీ రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి
Follow us on

Love Story Movie: నాగచైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ప్రేమ కథా చిత్రం లవ్‌ స్టోరీ. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది. లాక్‌డౌన్ మొదలు అవ్వకముందే ఈ మూవీ షూటింగ్‌ 70శాతానికి పైగా పూర్తి అయ్యింది. ఇక మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని భావించిన చిత్ర యూనిట్‌.. గత నెలలోనే చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో షూటింగ్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్‌ రషెస్‌ని చూసిన శేఖర్ కమ్ముల ఇందులో కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేయాలని భావించారట.

ఈ నేపథ్యంలో సాయి పల్లవి డేట్లను అడగ్గా.. ఆమె వెంటనే ఇచ్చేసిందని సమాచారం. దీంతో రెండు వారాల పాటు లవ్‌స్టోరీ రీ షూట్‌ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ట్రాజెడీ ప్రేమకథగా లవ్‌స్టోరీ ఉండబోతుందని.. ఇందులో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఫిదా సక్సెస్ తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

‘కేజీఎఫ్‌ 2’కు కొత్త రిలీజ్ డేట్‌..!

దేశంలో కరోనా విజృంభణ.. 70లక్షలను దాటేసిన కేసులు