ఆర్జీవి ‘మర్డర్’ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్‍లో విడుదల కానున్న మూవీ.. ఎప్పుడంటే..

|

Dec 17, 2020 | 7:57 PM

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. గతంలో సంచనలం సృష్టించిన మిర్యాలగూడ అమృత, ప్రణయ్‏ల ప్రేమ కథ ఆధారంగా

ఆర్జీవి మర్డర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్‍లో విడుదల కానున్న మూవీ.. ఎప్పుడంటే..
Follow us on

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. గతంలో సంచనలం సృష్టించిన మిర్యాలగూడ అమృత, ప్రణయ్‏ల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‏ను హత్య చేయించారు. కాగా రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో ఆనంద్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సినిమా రిలీజ్‏కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మర్డర్ సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెకంట్ ట్రైలర్ కూడా విడుదలైంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.