ఆఫర్లు నిల్.. సంచలన నిర్ణయం తీసుకున్న రకుల్

| Edited By:

Dec 15, 2019 | 2:00 PM

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు సౌతిండస్ట్రీలో ఈ సంవత్సరం పెద్దగా అచ్చి రాలేదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఆమెకు అన్ని పరాజయాలే పడ్డాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, దేవ్, ఎన్జీకే, మన్మథుడు 2 ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరోవైపు టాలీవుడ్‌లో ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక హవా నడుస్తుండగా.. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ […]

ఆఫర్లు నిల్.. సంచలన నిర్ణయం తీసుకున్న రకుల్
Follow us on

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు సౌతిండస్ట్రీలో ఈ సంవత్సరం పెద్దగా అచ్చి రాలేదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఆమెకు అన్ని పరాజయాలే పడ్డాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, దేవ్, ఎన్జీకే, మన్మథుడు 2 ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరోవైపు టాలీవుడ్‌లో ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక హవా నడుస్తుండగా.. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే తన రెమ్యునరేషన్‌ను 25శాతం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిలింనగర్ వర్గాల ప్రకారం రకుల్‌ ఇప్పుడు రూ.2కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ఆఫర్లు లేకపోవడంతో రకుల్, తాను హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ఇళ్లను అమ్మేసిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని ఖండించిన రకుల్.. ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు సృష్టిస్తారో అంటూ మండిపడింది. తాను టాలీవుడ్‌ను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం, కమల్ హాసన్ ‘ఇండియన్‌ 2’, బాలీవుడ్‌లో అర్జున్ కపూర్ సరసన మరో సినిమాలో రకుల్ నటిస్తోంది.