కెరీర్ స్టార్టింగ్లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్తరుణ్ తరువాత పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యాడు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే వచ్చి పోయిన సంగతి కూడా తెలియదు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్లో తెరకెక్కిన లవర్ మూవీ కూడా రాజ్ తరుణ్కు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో స్టోరీల ఎంపిక విషయంలో ఆచి, తూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి మరోసారి దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు జీఆర్ కృష్ణ దర్శకుడు. ఇటీవలే ఈ మూవీ గ్రాండ్గా లాంచ్ అయింది. అయితే హీరోయిన్ ఎవరన్నది మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. అయితే తాజాగా రాజ్ తరుణ్కు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నట్లు మూవీ టీం ఎనౌన్స్ చేసింది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని కెరీర్ కూడా టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సాగటం లేదు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్, షాలినిలకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.