ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు

|

Dec 27, 2020 | 4:14 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్  చివరిదశలో ఉంది.  ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.

ప్రభాస్ రాధేశ్యామ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. చివరగా వచ్చిన ‘సాహో’ సినిమా అంతగా ప్రభావం చూపకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అన్న చర్చ మొదలైంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను 2021 జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేసుకొని  తెలుగు, హిందీ సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో రాధేశ్యామ్ ను జూన్ లో తీసుకురావడమే మంచిదని మేకర్స్ అనుకుంటున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాగో చాలా సమయం పట్టేలా ఉండటంతో జూన్ అయితేనే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తారని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతర్వాత నాగ్ అశ్విన్ సినిమా అలాగే, కేజీఎఫ్ డైరెక్టర్ తో ‘సలార్’ , ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ సినిమాలను పట్టాలెక్కించనున్నాడు ప్రభాస్.