బిగ్ బాస్-3 షో కు మరో షాక్ ! హైకోర్టులో కేతిరెడ్డి ‘ పిల్ ‘

| Edited By:

Jul 17, 2019 | 1:18 PM

బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఈ షో పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన […]

బిగ్ బాస్-3 షో కు మరో షాక్ !  హైకోర్టులో కేతిరెడ్డి  పిల్
Follow us on

బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఈ షో పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సినిమాలకు సెన్సారింగ్ చేసినట్టే ఈ బిగ్ బాస్ షో కు కూడా సెన్సారింగ్ అవసరమని, అశ్లీలత, ద్వంద్వార్థాలతో కూడిన ఈ కార్యక్రమానికి సెన్సార్ ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ షో ను నిలిపివేయడం సాధ్యం కాని పక్షంలో.. రాత్రి 11 గంటల తరువాతే ఎపిసోడ్స్ ప్రసారం చేసేలా ఆదేశించాలని ఆయన కోరారు.