pawan kalyan- krish movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్ త్వరలో క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇక పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేసిన విషయం తెలిసిందే. వీటిలో డైరెక్టర్ క్రిష్ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ పిరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏయం రత్నం నిర్మిస్తున్నారు. కాగా ఈసినిమా స్క్రిప్ట్ పనులను శరవేగంగా పూర్తి చేసాడట క్రిష్. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను మొఘలుల కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే వీలైనంత త్వరగా క్రిష్ సినిమా పూర్తి చేసి పవన్ కళ్యాణ్..అయ్యప్పన్ కోషియం రీమేక్ షూటింగ్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడట . మరో క్రిష్ పవన్ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేస్తాడో చూడాలి.
Also read: