
ప్రస్తుతం ఓటీటీలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా కథ ఒక రహస్యమయమైన ద్వీపం చుట్టూ తిరుగుతుంది, అక్కడికి కథానాయకుడు తన తాతను కాపాడటానికి వెళ్తాడు. ఆ ద్వీపం ఎన్నో రహస్యాలతో నిండి ఉంటుంది . కానీ త్వరలోనే అది నీటిలో మునిగిపోతుంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. దీని కథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే, మీకు అస్సలు విసుగు అనిపించదు. ఇది 1 గంట 33 నిమిషాల నిడివి గల ఒక హాలీవుడ్ చిత్రం. ఈ సినిమా సుమారు పద్నాలుగేళ్ల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు దశాబ్దంన్నర తర్వాత, ఈ చిత్రం ఓటీటీలో రాణిస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించిన ‘జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్’ చిత్రం 2012లో విడుదలైంది. ఇది 2008లో విడుదలైన ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ చిత్రానికి కొనసాగింపు.
ఇందులో డ్వేన్ జాన్సన్, మైఖేల్ కేన్, జోష్ హచర్సన్, వెనెస్సా హడ్జెన్స్, లూయిస్ గుజ్మాన్ మరియు క్రిస్టిన్ డేవిస్ నటించారు. ఈ చిత్రం, కోడెడ్ డిస్ట్రెస్ సిగ్నల్ను అనుసరించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక రహస్యమైన , మ్యాప్లో లేని ద్వీపానికి చేరుకున్న టీనేజర్ సీన్ అండర్సన్ (జోష్ హచర్సన్) , అతని సవతి తండ్రి హాంక్ (డ్వేన్ జాన్సన్) కథను చెబుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
ఇది 2012లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటి. ఇప్పుడు, పద్నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలోకి ప్రవేశించింది. భారతదేశంలో ఈ చిత్రంపై క్రేజ్ మరోసారి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..