
రీసెంట్ డేస్ లో వరుసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఓ సినిమా నెలరోజులలోపే ఓటీటీలోకి రానుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
టాలీవుడ్ టాలెంటడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు శ్రీ విష్ణు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ అలరిస్తున్నాడు శ్రీవిష్ణు. ఇటీవలే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ సినిమాలు రిలీజ్ చేశాడు శ్రీవిష్ణు. వీటిలో మృత్యుంజయ్ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. మంచి టాక్ సొంతం చేసుకున్న మృత్యుంజయ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
మృత్యుంజయ్ సినిమా మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సంస్థ మృత్యుంజయ్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాలో శ్రీవిష్ణు దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చే ఉద్యోగం చేస్తుంటాడు.. ఈ క్రమంలోనే వరుసగా హత్యలు చేస్తున్న ఓ హంతకుండు చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాను ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.