Kantara: సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్.. ఓటీటీలో మాత్రం తేలిపోయిన కాంతారా

|

Dec 09, 2022 | 12:47 PM

అదుర్స్ అంతే.. రిషబ్ శెట్టి అరిపించాడు.. నెక్ట్స్ లెవల్ సినిమా.. ఇవి కాంతారాను థియేటర్‌లో చూసినవాళ్లు చెప్పిన మాటలు. కానీ మూవీ ఓటీటీకి వచ్చాక సిట్యూవేషన్ మారిపోయింది.

Kantara: సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్.. ఓటీటీలో మాత్రం తేలిపోయిన కాంతారా
Kantara Varaha Roopam
Follow us on

ఇండియన్ స్క్రీన్ మీద నయా సెన్సేషన్ కాంతార. వెండితెర మీద కాసుల పంట పండించిన ఈ సినిమా ఇటీవల డిజిటల్‌ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే థియేట్రికల్ రిలీజ్‌లో భారీగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను మాత్రం ఆ రేంజ్‌లో మెప్పించలేకపోతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్‌ శెట్టి స్యయంగా దర్శకత్వం వహించి నటించిన సినిమా కాంతార. సాండల్‌వుడ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా తరువాత నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ కాంతార వసూళ్ల సునామీ సృష్టించింది.

కలెక్షన్ల పరంగానే కాదు టాక్ పరంగానూ కాంతార కన్నడ సినిమా స్థాయిని ఎంతో పెంచింది. ఈ సినిమా కథా కథనాలు, హీరో పర్ఫామెన్స్‌ గురించి నేషనల్ లెవల్‌లో చర్చ జరిగింది. ఇంత హైప్ రావటంతో కాంతార ఆల్‌ టైమ్ క్లాసిక్‌ నిలుస్తుందని భావించారు ఇండస్ట్రీ జనాలు. డిజిటల్ రిలీజ్‌ తరువాత సీన్ మారిపోయింది. ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా… మరీ క్లాసిక్ అన్న రేంజ్‌ అయితే లేదంటున్నారు ఆడియన్స్‌. అసలు థియేట్రికల్‌లో రిలీజ్‌లో ఎందుకంత హైప్‌ క్రియేట్‌ చేశారో అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

కొంతమంది డిజిటల్ ఆడియన్స్‌ అయితే… ఓవర్‌ రేటెడ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ మొదలు పెట్టారు. క్లైమాక్స్ తప్ప సినిమా అంతా పరమ రొటీన్‌గా ఉందంటూ.. విమర్శలు చేస్తున్నారు. మరి ఈ టాక్ విషయంలో మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.