BalaKrishna: ఆహాలో బాలయ్య టాక్ ‏షో.. మొదటి గెస్ట్ ఎవరో చెప్పిన మేకర్స్..

|

Oct 31, 2021 | 12:21 PM

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను అందిస్తూ విజయవంతగా

BalaKrishna: ఆహాలో బాలయ్య టాక్ ‏షో.. మొదటి గెస్ట్ ఎవరో చెప్పిన మేకర్స్..
Balakrishna
Follow us on

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను అందిస్తూ విజయవంతగా దూసుకుపోతుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. అంతేకాకుండా.. గేమ్ షోస్.. టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్‏ఫాంలకు గట్టిపోటీనిస్తుంది. అయితే గతంలో సమంతతో సామ్ జామ్ అనే టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ఆహా సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యింది. బాలయ్య హోస్ట్‏గా ఓ టాక్ షోను ఆహా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ షో నవంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. అయితే బాలయ్య షోకు మొదటి ఎపిసోడ్‏లో అతిథులుగా ఎవరు రాబోతున్నారు… బాలకృష్ణ ఎవరిని ప్రశ్నించబోతున్నారనేదానిపై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొద్ది రోజుల క్రితం.. బాలకృష్ణ టాక్ షో నుంచి బాలయ్య.. మోహన్ బాబు తీసుకున్న సెల్ఫీ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. దీంతో బాలకృష్ణ టాక్ షో మొదటి అతిథి డైలాగ్ కింగ్ మోహన్ బాబు అని అంతా అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. డైలాగ్ కింగ్ ఫ్యామిలీ మోహన్ బాబు.. మంచు లక్ష్మి, మంచు విష్ణులను బాలకృష్ణ ఇంటర్య్వూ చేసినట్లుగా కన్ఫార్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్‏ను నెట్టింట్లో షేర్ చేసి అసలు విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన సత్తా చూపించిన బాలయ్య.. బుల్లితెరరపై ఎలాంటి సందడి చేయనున్నారో అని అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో ప్రత్యేక అతిథులుగా సినీ ప్రముఖులు రానున్నాయి.

ట్వీట్…

Also Read: Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఆ కారణంగానే చనిపోయాడా ? .. అసలు విషయాలు చెప్పిన వైద్యులు..

Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..