
ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాదిలో అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. కానీ ఊహించని విధంగా ఓటీటీలో సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో చెప్పలేదు కదూ.. అదే గ్రౌండ్ జీరో. 2025 సంవత్సరంలో విడుదలైన యాక్షన్ డ్రామాకు బాక్సాఫీస్ వద్ద అంతగా రెస్పాన్స్ రాలేదు.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ..
ఈ చిత్రాన్ని బిఎస్ఎఫ్ అధికారి నరేంద్ర నాథ్ ధర్ దుబే జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రను పోషించగా.. సాయి తమహంకర్, జోయా హుస్సేన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. శ్రీనగర్ నేపథ్యంలో సాగే ఈ కథ ముందుగా ఉగ్రవాదుల కాల్పులు, ఎన్ కౌంటర్ వంటి సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగే భయానక సన్నివేశాలతో సాగుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా చివర క్లైమాక్స్లోని 20 నిమిషాలలో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కానీ థియేటర్లలో మాత్రం ఈ చిత్రానికి అంతగా స్పందన రాలేదు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా దేశంలోని టాప్ 10 జాబితాలో మూడవ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద రూ.10.35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి తేజస్ ప్రభా విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహించగా.. ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..