టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. అనంతరం దాంతో సెల్ఫీని తీసుకున్న మహేశ్ బాబు.. ఈ బొమ్మతో అభిమానులు సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. కాగా ఈ విగ్రహం తయారీకి ఆరు నెలల పాటు 20మంది కళాకారులు శ్రమించారు. ఈ విగ్రహం కోసం 3లక్షల డాలర్లు ఖర్చు అయింది. త్వరలోనే ఈ విగ్రహాన్ని సింగపూర్లోకి మేడమ్ తుస్సాడ్స్కు పంపనున్నారు. మహేశ్ బాబు సొంత మల్టీఫెక్స్ ఏఎంబీ సినిమాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్ కుటుంబసభ్యులతో పాటు, మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
Pics from the launch of Superstar @urstrulyMahesh's Wax Figure @amb_cinemas #MaheshBabuMTSG #MadameTussaudsSG #MTSG #SSMB pic.twitter.com/qGjzSmxdhN
— BARaju (@baraju_SuperHit) March 25, 2019