‘మహానటి’ కొత్త స్కెచ్.. ‘మిస్ ఇండియా’ అవుతుందా..!

| Edited By:

Oct 22, 2019 | 9:40 AM

సావిత్రి బయోపిక్‌ పుణ్యమా అని నిన్నటిదాకా మహానటి అని పిలిపించుకునేది కీర్తి సురేశ్‌. కానీ రేపట్నించి తనను మిస్‌ ఇండియా అని పిలవాల్సిందే అనే ధీమా ఇప్పుడు కనబరుస్తోంది ఈ భామ. తాజా సమాచారం ప్రకారం కీర్తి ఖాతాలో ఖతర్నాక్‌ మూవీగా తయారవుతోంది మిస్‌ ఇండియా. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో వస్తున్న మిస్ ఇండియా ఒక మోడల్‌ లైఫ్‌ సర్కిల్‌ నేపథ్యంతో తెరకెక్కుతోందట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా పదికిలోల బరువు తగ్గిందట […]

మహానటి కొత్త స్కెచ్.. మిస్ ఇండియా అవుతుందా..!
రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఇటీవల రంగ్ దే సినిమాతో వచ్చింది కీర్తి. ఈ సినిమా పర్లేదనిపించుకుంది. 
Follow us on

సావిత్రి బయోపిక్‌ పుణ్యమా అని నిన్నటిదాకా మహానటి అని పిలిపించుకునేది కీర్తి సురేశ్‌. కానీ రేపట్నించి తనను మిస్‌ ఇండియా అని పిలవాల్సిందే అనే ధీమా ఇప్పుడు కనబరుస్తోంది ఈ భామ. తాజా సమాచారం ప్రకారం కీర్తి ఖాతాలో ఖతర్నాక్‌ మూవీగా తయారవుతోంది మిస్‌ ఇండియా. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో వస్తున్న మిస్ ఇండియా ఒక మోడల్‌ లైఫ్‌ సర్కిల్‌ నేపథ్యంతో తెరకెక్కుతోందట.

ఇక ఈ సినిమా కోసం ఏకంగా పదికిలోల బరువు తగ్గిందట కీర్తి. ఒక పల్లెటూరి అమ్మాయిగా జర్నీ మొదలై.. తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యేవరకూ.. ఐదు విభిన్న పాత్రలలో కీర్తి కనిపించనుందట. మోడల్‌గా ఒకమ్మాయి ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా వుంటుంది.. ఆ జర్నీలో భాగంగా
ఆమెలో కనిపించే షేడ్స్‌ ఏంటి..? అనే థీమ్‌తో మిస్ ఇండియా తయారవుతోందట. లుక్స్‌ పరంగా, యాక్టింగ్‌ పరంగా ఇది నెక్ట్స్ లెవల్‌ మూవీ అని నమ్మిన కీర్తి.. అందుకే దర్శకుడు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఓకే చెప్పి.. అందుకోసం శరీరాన్ని కూడా తగ్గించిందట. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ సినిమాలో భాగంగా ఏకంగా 52 లుక్స్‌ కోసం కీర్తి కసరత్తు షురూ చేసిందట.

ఇక మిస్‌ ఇండియా సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్ ఇటీవల యూరప్‌లో పూర్తి అయ్యింది. కేవలం 7 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. దాన్ని కూడా హైదరాబాద్‌ సెట్‌లో పూర్తి చేస్తామని యూనిట్ క్లారిటీ నిచ్చేసింది. ఇక ఈ సినిమాను డిసెంబర్‌ మొదటి, రెండు వారాల్లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీతో పాటు కీర్తి చేతిలో మరిన్ని చిత్రాలున్నాయి. మైదాన్‌ అనే బాలీవుడ్ మూవీలో… నగేష్‌కుకునూర్ డైరెక్షన్‌లో సఖి.. కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో పెంగ్విన్ మూవీతో పాటు మలయాళ్ మూవీలో నటిస్తోంది ఈ మహానటి.