మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఘట్టమనేని ‘మనం’ రెడీ..!

| Edited By:

Feb 11, 2020 | 9:40 PM

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లిన మహేష్.. అక్కడి నుంచి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి చిత్రంలో నటించబోతున్నారు. మహర్షి తరువాత ఈ కాంబినేషన్లో రెండో చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుండగా.. దీనికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఘట్టమనేని మనంగా ఈ మూవీ తెరకెక్కబోతుందట. ఫిలింనగర్‌ వర్గాల సమాచారం […]

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఘట్టమనేని మనం రెడీ..!
Follow us on

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లిన మహేష్.. అక్కడి నుంచి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి చిత్రంలో నటించబోతున్నారు. మహర్షి తరువాత ఈ కాంబినేషన్లో రెండో చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుండగా.. దీనికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే ఘట్టమనేని మనంగా ఈ మూవీ తెరకెక్కబోతుందట. ఫిలింనగర్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు కృష్ణ, గౌతమ్ కీలక పాత్రలలో కనిపించనున్నారట. అలాగే నమ్రత, సితార కూడా కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఘట్టమనేని అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక దిల్ రాజు, మహేష్ బాబు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. సంగీత దర్శకుడిగా థమన్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఏప్రిల్‌లో గానీ మేలో గానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.