Bharat Ratna for SPB: గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్న కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు అన్నీ కలిసి పోరాడాలని సూచించారు. భారత రత్నకు ఎస్పీబీ అన్ని విధాల అర్హుడు అని తెలిపారు. 45 వేల పాటలు రెండు జన్మలు ఎత్తినా ఇంకెవ్వరు పాడలేరని అర్జున్ అన్నారు. పాటలో చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా సరే బాలు ఆ పాటను పాడే వారు కాదని అర్జున్ చెప్పుకొచ్చారు. కాగా కరోనాతో కోలుకున్నప్పటికీ.. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Read More:
ఆ విషయం చెప్పగానే రాజమౌళి ఒప్పుకున్నారు: చిరంజీవి
13ఏళ్ల క్రితం నాటి ఫ్లాప్.. ఇప్పటికీ అప్పులు కడుతోన్న బాలయ్య నిర్మాత