కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత

| Edited By:

Aug 21, 2020 | 12:00 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు అస్లాంఖాన్‌ కన్నుమూశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున

కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత
Follow us on

Aslam Khan death: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు అస్లాంఖాన్‌ కన్నుమూశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకు ముందే అస్లాంఖాన్‌కి బీపీ, షుగ‌ర్, గుండెజ‌బ్బు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌గా ప‌రిస్థితి విష‌మించింది. దీంతో వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కాగా దిలీప్‌కుమార్ సోద‌రులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లకు కరోనా లక్షణాలు ఉండటంతో గత వారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన ప‌రీక్ష‌ల్లో.. ఇద్ద‌రికీ క‌రోనా ఉన్న‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. ఈ క్రమంలో వారికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తగా.. వెంటనే ఐసీయూకి తరలించారు. వ‌య‌సు పైబ‌డ‌టం, తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతోనే ప‌రిస్థితి విష‌మించి అస్లాం ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అస్లాం మృతితో దిలీప్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More:

కరోనాను జయించిన శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్

మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య