Stree 2 Trailer: అయ్యా బాబోయ్.. నవ్విస్తునే వణుకు పుట్టిస్తోన్న హారర్ కామెడీ.. స్త్రీ 2 ట్రైలర్ చూశారా..?

|

Jul 18, 2024 | 7:09 PM

ఇందులో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నండగా.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్త్రీ 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Stree 2 Trailer: అయ్యా బాబోయ్.. నవ్విస్తునే వణుకు పుట్టిస్తోన్న హారర్ కామెడీ.. స్త్రీ 2 ట్రైలర్ చూశారా..?
Stree 2 Trailer
Follow us on

బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం స్త్రీ.. ఐదేళ్ల కిందట హిందీలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 180 కోట్లు రాబట్టింది. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నండగా.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్త్రీ 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మొదటి పార్టులో స్త్రీ అనే దెయ్యం చందేరి గ్రామ ప్రజలను వెంటాడుతుంది. కానీ ఆ దెయ్యం ఇప్పుడు చందేరి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళగా.. ఇప్పుడు మరో కొత్త సమస్య ఆ గ్రామాన్ని వెంటాడుతుంది. స్త్రీ దెయ్యం వదిలిపెట్టడంతో ఇక ఎలాంటి సమస్య లేదని ఊపిరి పీల్చుకుంటారు ఆ ఊరి ప్రజలు. కానీ అప్పుడే తలలేని రాక్షసుడు ఆ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తాడు. అతడు అడుగుపెట్టిన రోజు నుంచే గ్రామంలో మనుషులు మాయం అవుతుంటారు. ఇక ఈ క్రమంలోనే చందేరి ప్రజలు తమను కాపాడాలంటూ స్త్రీ దెయ్యంను వేడుకుంటారు. మరి ఆ స్త్రీ దెయ్యం చందేరి ప్రజలను కాపాడానికి వస్తుందా..? స్త్రీ దెయ్యాన్ని ఊర్లోకి తీసుకురావడానికి రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ ఏం చేశారు.. ? అనేది సినిమా.

ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అటు భయపెట్టడమే కాకుండా… కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాలో బీటౌన్ హీరో అక్షయ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. మరీ ఈ హారర్ కామెడీ ట్రైలర్ మీరు చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.