తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘మంకథ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. 2011లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడట దర్శకుడు వెంకట్ ప్రభు.
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘సీక్వెల్ గురించి అజిత్తో మాట్లాడడం జరిగిందని.. అందుకు తగిన స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నానని’ తెలిపారు. ఇక ప్రస్తుతం అజిత్ హిందీ చిత్రం ‘పింక్’ తమిళ రీమేక్ లో నటిస్తుండగా.. ఈ చిత్రం తర్వాత మురుగదాస్తో ఒక చిత్రం చేయనున్నాడు. కాగా ఈ రెండు చిత్రాల తర్వాత ‘మంకథ’ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.