AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సాయిపల్లవి.. నిర్మాతలకు చుక్కలే

ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకుంటే కష్టం కదా. తాజాగా సాయిపల్లవి టాలీవుడ్ నిర్మాత గుండెల్లో ఒక పెద్ద బాంబే పేల్చింది. మీడియం రేంజ్ చిత్రాలకు సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకునే వాళ్లకి..

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సాయిపల్లవి.. నిర్మాతలకు చుక్కలే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 4:30 PM

Share

భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల అంటూ యువతని ఫిదా చేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాతో పరిచయమైన సాయి పల్లవి.. తక్కువ కాలంలో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే మెగా వారబ్బాయి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తన కెరీర్‌లో హిట్స్ ఎక్కువగా లేనప్పటికీ.. నేచురల్ బ్యూటీ నటన, చలాకీ తనం, ఆటిట్యూడ్‌ అభిమానులకు తెగ నచ్చేశాయి.

ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకుంటే కష్టం కదా. తాజాగా సాయిపల్లవి టాలీవుడ్ నిర్మాత గుండెల్లో ఒక పెద్ద బాంబే పేల్చింది. మీడియం రేంజ్ చిత్రాలకు సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకునే వాళ్లకి ఇది కాస్త చేధు వార్తే అని చెప్పాలి. తాజాగా ఒప్పుకోబోయే సినిమాలకి సాయి పల్లవి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు పలు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు సాయి పల్లవి ఒక సినిమా 1.40 కోట్లను డిమాండ్ చేస్తుందట. ఆమె ఇంతలా రెమ్యునరేషన్ చేయడంతో నిర్మాతలు కంగుతింటున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి డిమాండ్ చేస్తోన్న పారితోషికం సమంత, అనుష్క, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్‌తో సమానం. ఎంతలా క్రేజ్ ఉంటే మాత్రం ఇంతలా రెమ్యునరేషన్ పెంచేస్తుందా? అంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానాతో ‘విరాట పర్వం’, అలాగే నాగచైతన్య సరసన ‘లవ్‌ స్టోరీ’లోనూ నటిస్తోంది. వీటి తరువాత కిశోర్ తిరుమల తెరకెక్కించబోయే కామెడీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌లో మరోసారి కలిసి జోడీ కట్టబోతోంది సాయి పల్లవి.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్