సోషల్ మీడియా నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో..!

| Edited By:

Jun 07, 2020 | 4:15 PM

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన ఉన్ని ముకుందన్.

సోషల్ మీడియా నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో..!
Follow us on

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన ఉన్ని ముకుందన్.. ”హాయ్ ఫ్రెండ్స్. నా అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నా. నా తదుపరి సినిమా ‘మెప్పాడియన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టీమ్ ఉన్ని ముకుందన్ నా తదుపరి సినిమాల గురించి సమాచారాన్ని ఇస్తుంది. మిమ్మల్ని సినిమా థియేటర్‌లో కలుసుకుంటా. థ్యాంక్యు” అని రాసుకొచ్చారు. అయితే ఆయన శాశ్వతంగా సోషల్ మీడియా నుంచి వైదొలిగారా లేక కొద్ది రోజుల తరువాత మళ్లీ ఎంట్రీ ఇస్తారా..? అన్న విషయం మాత్రం తెలీదు.

కాగా జనతా గ్యారేజ్‌, భాగమతి సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమైన ఉన్ని ముకుందన్ ప్రస్తుతం మెప్పాడియన్‌లో నటిస్తున్నారు. విష్ణు మోహన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌ గ్రామ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన బరువు కూడా పెరిగారు. దానికి సంబంధించిన ఫొటోలు ఆ మధ్యన వైరల్‌గా మారాయి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Read This Story Also: టాలీవుడ్ నిర్మాతలపై కన్నడ నిర్మాతల ఫైర్.. కారణమేంటంటే!